ప్రముఖ సీనియర్‌ నటుడు శరత్‌ బాబు మే 22, సోమవారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే.

మల్టీపుల్‌ ఆర్గాన్స్‌ ఫెయిల్యూర్‌ కారణంగా ఆయన హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.

మంగళవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు చెన్నైలో పూర్తయ్యాయి.

శరత్‌ బాబు సోదరుడు శరత్‌ బాబు పార్థివ దేహానికి తలకొరివి పెట్టారు.

శరత్‌ బాబుకు పిల్లలు లేకపోవటంతో సోదరుడు ఆయన చితికి నిప్పు పెట్టింది.

అంతకు క్రితం, సోమవారం హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో ఆయన భౌతిక ఖాయాన్ని ఉంచారు.

సాయంత్రం 2 గంటల పాటు సందర్శనార్థం  భౌతిక ఖాయాన్ని ఉంచారు.

తర్వాత శరత్‌ బాబు భౌతిక దేహాన్ని అక్కడినుంచి చెన్నైకి తీసుకెళ్లారు.

కాగా, శరత్‌ బాబు 300లకు పైగా సినిమాల్లో నటించారు.

హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా.. విలన్‌గా నటించారు.

ఆయన చివరగా ‘మళ్లీ పెళ్లి’ అని సినిమాలో నటించారు.