టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ఏం చేసినా సంచలనమే. ఆమెను కోట్లాది మంది ఆరాధిస్తుంటారు.
సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలతోనూ తన ఫాలోయింగ్ను మరింతగా పెంచుకున్నారు సమంత.
మయోసైటిస్తో బాధపడుతుండటంతో కెరీర్లో కొన్నాళ్లు వెనుకపడిన సమంత.. ఇప్పుడు మళ్లీ వేగం పెంచారు.
వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నారు సమంత. ప్రస్తుతం ఆమె రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నారు
హాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ హిందీ రీమేక్లోనూ యాక్ట్ చేస్తున్నారు సామ్.
ఇందులో సమంతతో పాటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఇటీవల ‘శాకుంతలం’తో ఆడియెన్స్ ముందుకు వచ్చిన సమంతకు నిరాశే మిగిలింది. ‘శాకుంతలం’ మూవీ అట్టర్ ఫ్లాప్గా నిలిచింది.
‘శాకుంతలం’ రిజల్ట్ షాక్ ఇచ్చినా సమంత తగ్గేదేలే అంటున్నారు. తదుపరి చేయబోయే ప్రాజెక్టులపై ఆమె ఫోకస్ పెడుతున్నారు.
సినిమాలతో ఒకవైపు ఎంత బిజీగా ఉన్న స్నేహితులు, కుటుంబీకులతో వీలు కుదిరినప్పుడు గడుపుతుంటారు సమంత.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత.. తాజాగా పెట్టిన ఒక పోస్ట్ వైరల్గా మారింది.
సరైన జోడీ కావాలంటూ ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది.
అయితే సమంత పార్ట్నర్ను వెతుకుతోంది తన కోసం కాదు.. తన ఫ్రెండ్, డాక్టర్ జెవెల్ గమాడియా కోసమట.
గమాడియా తెలివైనవాడని, ఆయన సరైన జోడీ కోసం వెతుకుతున్నామని సమంత ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.
వెస్ట్రన్ ఆక్యుపెంచర్ ఎక్స్ పర్ట్ అయిన గమాడియా దగ్గర కత్రినా కైఫ్ చికిత్స తీసుకున్నారట.
ఆయన వద్ద సమంత కూడా ట్రీట్ మెంట్ తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.