టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది.
రీసెంట్ గా ‘శాకుంతలం’తో ఆడియెన్స్ ను సామ్ పలకరించింది. అయితే ఆ చిత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.
‘శాకుంతలం’ రిజల్ట్ ఊహించని విధంగా వచ్చినా సమంత జోరు మాత్రం ఆగడం లేదు. ఆమె ప్రస్తుతం ‘ఖుషి’ అనే చిత్రంలో నటిస్తోంది.
‘ఖుషి’తో పాటు ‘సిటాడెట్’ వెబ్ సిరీస్ ఇండియన్ రీమేక్లోనూ సామ్ యాక్ట్ చేస్తోంది.
‘ఖుషి’ ఫిల్మ్లో సమంత, విజయ్ దేవరకొండలు కలసి నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఒక పాట విడుదలైంది.
‘ఖుషి’ రిలీజ్కు ఇంకా చాలా సమయమే ఉంది. కానీ వీలు దొరికినప్పుడల్లా ఈ మూవీని ప్రమోట్ చేస్తోంది చిత్ర యూనిట్.
తాజాగా సమంత, విజయ్లు కలసి స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో తెగ సందడి చేశారు.
క్రికెట్ గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు సామ్-విజయ్లు. మహేంద్ర సింగ్ ధోని అంటే తమకు ఇష్టమని వాళ్లిద్దరూ అన్నారు.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తన ఫేవరెట్ టీమ్ అని సమంత చెప్పుకొచ్చింది
ధోని నచ్చిన ఆటగాడు అయినప్పటికీ విరాట్ కోహ్లీని తాను స్ఫూర్తిగా తీసుకుంటానని తెలిపింది సామ్.
మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినా.. కోహ్లీ స్ట్రాంగ్గా కమ్బ్యాక్ ఇచ్చాడని సమంత మెచ్చుకుంది.
ఆ టైమ్లో అతడు సెంచరీ కొట్టడంతో తాను ఉద్వేగానికి లోనయ్యాయని చెప్పింది.
కోహ్లీ కమ్బ్యాక్లో సెంచరీ కొట్టడం చూసి తాను ఎమోషనల్ అయ్యానని.. ఏడ్చేశానని సమంత వ్యాఖ్యానించింది.
సమంత, విజయ్లు కలసి పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.