మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా పొన్నియిన్ సెల్వన్.
విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి స్టార్లు నటించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతోంది.
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రభు, ఆర్. శరత్ కుమార్, జయరాం వంటి సీనియర్ నటులు కూడా నటించారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకి ఈ స్టార్లు భారీగానే పారితోషికం తీసుకున్నట్లు టాక్.
ఆదిత్య కరికాలుడుగా నటించిన విక్రమ్ పారితోషికం రూ. 12 కోట్లు
ద్విపాత్రాభినయం చేసిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ రూ. 10 కోట్లు
కుందవై పాత్రలో నటించిన త్రిష పారితోషికం రూ. 2.5 కోట్లు
అరుణ్ మోజి వర్మ పాత్రలో నటించిన జయం రవి రూ. 8 కోట్లు
వందియ దేవుడు పాత్రలో నటించిన కార్తి పారితోషికం రూ. 5 కోట్లు
శోభిత ధూళిపాళ పారితోషికం రూ. కోటి
పూన్ ఘజళీ పాత్రలో నటించిన ఐశ్వర్య లక్ష్మి పారితోషికం రూ. కోటిన్నర
సీనియర్ నటుడు ప్రభు పారితోషికం రూ. కోటి 25 లక్షలు
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పారితోషికం రూ. కోటి