ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా.. మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీ స్కార్పియోని లాంచ్ చేసింది.
ఈ స్కార్పియో-ఎన్ మోడల్ బుకిగ్స్ జులై 30 నుంచి ఓపెన్ చేయనున్నారు.
ప్రస్తుతం ప్రకటించిన ధరలన్నీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద మొదటి 25 వేల కార్లకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు.
మహీంద్రా స్కార్పియో-ఎన్ బేసిక్ లెవల్ పెట్రోల్ MT Z2 వేరియంట్ ధర రూ.11.99(ఎక్స్ షోరూమ్) లక్షల నుంచి ప్రారంభకానుంది.
హై ఎండ్ మహీంద్రా స్కార్పియో-N డీజిల్ MT 4x2 Z8 L వేరియంట్ ధర రూ. 19.49 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
స్కార్పియో-ఎన్ ను పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్లలో అందుబాటులోకి తెస్తోంది.
ఈ స్కార్పియో- ఎన్ 57 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 7 కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
ఈ కారులో ఎల్ఈడీ హెడ్ లైట్స్, కీ-లెస్ ఎంట్రీ అండ్ గో, డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్ ఉంది.
ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 8 ఇంచెస్ స్క్రీన్, అలెక్సా కంపాటబిలిటీ, వైర్లెస్ ఛార్జర్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ ఉన్నాయి.
ఏబీఎస్, ఏఎస్సీ, ట్రాక్షన్ కంట్రోల్, 360 డిగ్రీలో కెమెరాలు ఉంటాయి.
ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డెసెంట్ కంట్రోల్ ఉంది
టైర్ ప్రెషర్ మానిటర్, డ్రైవర్ డ్రౌజీనెస్ వార్నింగ్ వంటి సేఫ్టీ కంట్రోల్స్, ఫీచర్లతో ఈ స్కార్పియో-ఎన్ ని రూపొందించారు.