జర్మనీకి చెందిన ఆడి కంపెనీ త్వరలోనే భారత్లో ఇ-రిక్షా తీసుకురాబోతుంది.
జర్మన్, ఇండియన్ స్టార్టప్ అయిన నునామ్తో కలిసి ఈ ప్రయత్నం చేయబోతోంది.
ఆడి ఇ-ట్రాన్ వాహనాలను పరీక్షించడానికి ఉపయోగించిన బ్యాటరీలను ఈ ఆడి ఇ-రిక్షాల్లోఉపయోగించనున్నారు.
ఎక్కువ వోల్టేజ్ ఉన్న బ్యాటరీలను తిరిగి ఉపయోగించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
ఆడి ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాటరీలకు పునరుజ్జీవం కల్పించి వాటిని ఇ-రిక్షాల్లో అమర్చనుంది.
ఆడి ఏజీ, ఆడి ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్, నుమామ్ కలిసి తీసుకొస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇది.
ఆడి ఇ-రిక్షాను మొదట ఎలక్ట్రిసిటీతో ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత సోలార్ ఛార్జింగ్ స్టేషన్లలో కూడా ఛార్జ్ చేసేలా నునామ్ ఇ-రిక్షాలను రూపొందిస్తోంది.
ప్రస్తుతం ప్రోటోటైప్లు మాత్రమే తయారయ్యాయి. ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఇందులో మార్పులు ఉండొచ్చు.
పర్యావరణానికి మేలు చేయడం, మహిళలకు అండగా నిలవడం లాంటి లక్ష్యాలతో చేపట్టిన ప్రాజెక్ట్ కాబట్టి ఆడి ఇ-రిక్షాలు కమర్షియల్గా మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం లేదు.
వీటిని మొదట కేవలం స్వచ్ఛంద సంస్థలకు అందించేందుకే రూపొందిస్తున్నారు.