దేశంలో నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. 9 రోజుల పాటు దుర్గాదేవీని నియమ నిష్ఠలతో.. ఎంతో పవిత్రంగా పూజిస్తారు.
చాలా మంది ఈ రోజు ఉపవాసం కదా అని వ్యాయామ దిన చర్యను వాయిదా వేస్తారు. ఇది మంచి పద్దతి కాదు. ఉపవాసం రోజూ కూడా మీ దిన చర్యను కొనసాగించండి.
షుగర్ పేషంట్లకు తీపి పదార్థాలు విషంతో సమానం.
అలా అని తినకుండా ఉండమని చెప్పట్లేదు. మీరు మీ కోరికలను పండ్లను తినడం ద్వారా తీర్చుకోవచ్చు.
ఉపవాసం ఉన్న షుగర్ పేషంట్లు పండ్లు తినడం ద్వారా శక్తి పొందడమే కాకుండా తీపి తినాలన్న కోరిక కూడా తీరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.