టాలీవుడ్ సినీ రంగ పరిశ్రమలో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. 

ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ తన పంథాలో సంగీతాన్ని అందిస్తూ దూసుకు వెళుతుంటారు.

ఏ మ్యూజిక్ డైరెక్టరైనా వారు చేసిన మూవీస్‌లో బెస్ట్ కంపోజింగ్ సాంగ్స్ చాలానే ఉంటాయి. 

అయితే వీరిలో ఎప్పుడు ట్రోల్స్‌కి గురయ్యేది ఎవరంటే మాత్రం  ఎస్. ఎస్ తమనే. 

ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పగానే ట్రోలర్స్ రంగంలోకి దిగిపోతారు.

ఆయన ఎప్పుడు ఏదైనా సాంగ్, మ్యూజిక్ బిట్ విడుదల చేస్తారా అని.. ట్రోల్స్ చేయకపోతామా అని కాచుకుని కూర్చుంటారు.

సినిమా సాంగ్ రిలీజ్ అయినా, మ్యూజిక్ బిట్ అయినా, చివరికీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా సార్లు ట్రోలింగ్‌కు గురయ్యారు తమన్. 

పాత పాటను అటు తిప్పి, ఇటు తిప్పి, మరో పాటకు బీట్‌ను కంపోజ్ చేస్తారన్న అపవాదు ఉంది. 

గతంలో పాటను ఇలా చేశారంటూ  వీడియోలను జత చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేసిన సంగతి విదితమే

అయితే అవేమీ పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా సంగీతాన్ని అందిస్తుంటారు తమన్. అవే ఒక్కోసారి భారీ హిట్లను ఇస్తుంటాయి.

దీంతో ట్రోలింగ్స్ చేసిన చేతులే.. మెచ్చుకుంటుంటాయి. 

ఇప్పుడు తమన్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ట్రోలింగ్స్ విషయంలో కాదండీ. ఆయన తన మంచి మనస్సును చాటారు.

ప్రతి మ్యూజిక్ డైరెక్టర్లకు ఓ బృందం ఉంటుందన్న సంగతి విదితమే. అయితే ఆ టీమ్‌లోని మ్యూజిషియన్ ఒకరు అనారోగ్యానికి గురయ్యారట. 

ఆయనకు క్యాన్సర్ రాగా, కీమో చేయాల్సి వచ్చిందట. క్రమంలో శరీరం మొత్తం కాలిపోయిందట.

డిశ్చార్జి చేద్దాం అన్నా.. డబ్బులు ఇస్తే గానీ ఆసుపత్రి  నుండి పంపేది లేదని తేల్చి చెప్పడంతో ఈ విషయం తమన్‌కు తెలిసింది. 

ఆయన వెంటనే రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారట.

ఈ విషయాలను ఆహాలో ప్రసారమౌతున్న ఇండియన్ ఐడల్ తెలుగు కార్యక్రమంలో  గీతా మాధురి వెల్లడించారు. ఈ సాయం ఈ మధ్య కాలంలో చేసినట్లు ఆమె తెలిపారు.

మనిషి అన్నాక ఏదైనా మంచి చేయాలి కదా. షోల ద్వారా నేను సంపాదించిన డబ్బును ఛారిటీకి ఇవ్వాలని అనుకుంటున్నాను. అదే చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు తమన్‌. 

అలాగే గుంటూరులో ఓ పెద్ద అనాథాశ్రమం కడుతున్నానని.. త్వరలోనే పనులు పూర్తి చేసి ఓపెన్‌ చేస్తానని చెప్పారు తమన్‌.

తమన్‌ దాన గుణం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. 

అయితే ఇప్పుడు కూడా ఆయనపై ట్రోల్స్ చేస్తారా..చెప్పండి అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.