విజయ్‌ దేవరకొండ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సగటు సినీ ప్రేక్షకుడు ఎంతగానో ఎదురు చూసిన ‘లైగర్‌’ సినిమా గురువారం థియేటర్లలోకి వచ్చింది.

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్‌ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది.

సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికి కలెక్షన్ల విషయంలో మాత్రం లైగర్‌ సూపర్‌ అనిపించుకున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్‌ డేన మొత్తం కలెక్షన్లు 15 కోట్ల రూపాయలు వచ్చాయి.

ఇక, ప్రపంచవ్యాప్తంగా లైగర్‌ సినిమా 24.5 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.

ఈ నేపథ్యంలోనే సినిమాలో నటించిన వారి రెమ్యూనరేషన్‌లకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి.

(విజయ్‌ దేవరకొండ) రెమ్యూనరేషన్‌ 20 నుంచి 35 కోట్ల రూపాయలు (అంచనా)

(అనన్యపాండే)  3 కోట్ల రూపాయలు  (అంచనా)

విజయ్‌ తల్లిగా నటించిన  (రమ్య కృష్ణ) : కోటి రూపాయలు (అంచనా)

(రోనిత్‌ రాయ్‌) : 1.5 కోట్లు  ( అంచనా)

(విష్ణు రెడ్డి) : 60 లక్షలరూపాయలు ( అంచనా)

(మకరంద్‌ దేశ్‌పాండే) : 40 లక్షల రూపాయలుగా తెలుస్తోంది.

ఇక, ‘లైగర్‌’ సినిమాలో ప్రముఖ బాక్సింగ్‌ క్రీడాకారుడు మైక్‌ టైసన్‌  గెస్ట్‌ పాత్ర చేసిన సంగతి తెలిసిందే.

ఆయన విజయ్‌ దేవరకొండకంటే ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్‌గా తీసుకున్నట్లు సమాచారం.

మరి, సినిమాలో తక్కువ నిడివి ఉన్న పాత్ర చేసిన మైక్‌ టైసన్‌కు హీరో విజయ్‌ దేవరకొండ కంటే ఎక్కువ మొత్తం ఇచ్చారా లేదా అన్నది నిర్మాతలకే తెలియాలి.