ఇండియాలో 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన తొలి దేశీయ కంపెనీగా లావా ఇంటర్నేషనల్ రికార్డు సృష్టించింది.

‘అగ్ని’ పేరుతో లావా ఇంటర్నేషనల్ ఈ ఫోన్ ను రూపొందిస్తోంది.

దీని ఉత్పత్తి మొత్తం నోయిడాలోని తయారీ కేంద్రంలో చేస్తున్నారు.

దీని ధరను కంపెనీ ప్రస్తుతం రూ.19,999గా నిర్ణయించింది.

ప్రారంభ ధర కింద ముందు బుక్ చేసుకునేవారికి రూ.17,999కే ఇవ్వనున్నట్లు తమ వెబ్ సైట్ లో లావా ఇంటర్నేషనల్ తెలిపింది.

గ్లోబల్ వైడ్ గా మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్ తో 5జీ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన రెండో కంపెనీ లావా.

నవంబరు 18 నుంచి ప్రత్యక్ష మార్కెట్ తో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లోనూ లావా అగ్ని అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

అంతకన్నా ముందే బుక్ చేసుకోవాలంటే లావా ఈ-స్టోర్ లో ఆ అవకాశం కల్పించారు. నవంబరు 9 నుంచి 17 వరకు ప్రీ బుకింగ్స్ కు అవకాశం కల్పించింది.

అమెజాన్ లోనైతే రూ.500 చెల్లించి ప్రీ బుక్ చేసుకోవాలి.

లావా అగ్ని 6.78 అంగుళాల ఫుల్ హై డెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ పంచ్ హోల్ డిస్ ప్లేతో అందుబాటులోకి వస్తోంది.

లావా అగ్ని 6.78 అంగుళాల ఫుల్ హై డెఫినిషన్ ప్లస్ ఐపీఎస్ పంచ్ హోల్ డిస్ ప్లేతో అందుబాటులోకి వస్తోంది.

కెమెరా విషయానికి వస్తే 64 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ వైడ్ యాంగిల్, 2 ఎంపీ డెప్త్, 2 ఎంపీ మాక్రో కెమెరాలు ఉన్నాయి.16 మెగాపిక్సెల్ తో ఫ్రంట్ కెమెరా వస్తుంది.

అగ్ని లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ ఓఎస్ 11తో అందుబాటులోకి వస్తుంది.

5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ను అందించనున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అన్ లాక్ సిస్టమ్ ఉంటుంది.