టెలికాం సంచలనం రిలయన్స్ జియో.. మొబైల్ వినియోగదారులకు జియో ఫోన్ నెక్ట్స్ తో సర్ ప్రైజ్ ఇస్తున్న విషయం తెలిసందే.

‘ఇన్ ఇండియా, ఫర్ ఇండియన్స్, మేడ్ బై ఇండియన్స్,’ అనే స్లోగన్తో ఈ ఫోన్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

ఈ ఫోన్ ను గూగుల్ తో కలిసి అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఫోన్ కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్(వోఎస్)ను కూడా అభివృద్ధి చేశారు.

ప్రగతి ఓఎస్ బ్యాటరీని తక్కువ వినియోగించుకోవడం వల్ల.. బ్యాటరీని ఎక్కువ డ్రైయిన్ చేయదని చెబుతున్నారు.

ఏ ప్రాసెసర్ ఉపయోగించారు అనే విషయాన్ని వీడియోలో చెప్పనప్పటికీ.. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్ ను వినియోగించినట్లు లీకులు ద్వారా తెలిసింది.

మీరు ఏ యాప్ ఉపయోగిస్తున్నా ఆ యాప్ లోని మొత్తం వివరాలను జియో ఫోన్ నెక్ట్స్ చదివి వినిపించగలదు.

మీరు ఒక భాషలో మాట్లాడితే దానిని ఇంకో భాషలోకి మార్చవచ్చు. అది ఒకటి రెండు కాదు ఏకంగా 12 భాషల్లోకి ట్రాన్స్ లేట్ చేయగలదు.

చాలా తక్కువలో ఈ ఫోన్ ను ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. కెమెరా పెద్దగా క్వాలిటీ ఉండదని అనుకున్నారు. 13 మెగా పిక్సల్ కెమెరాను ఈ ఫోన్ లో పొందుపరిచారు.

ఈ ఫోన్ లో ప్లే స్టోర్ ద్వారా అన్ని రకాల యాప్ లను డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు.

 మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఈ ఫోన్ ను ఏపీలోని తిరుపతి, తమిళనాడులోని శ్రీపెరంబదూరు ప్లాంట్ లో తయారు చేస్తున్నారు.

పూర్తిగా ఈ ఫోన్ ఇండియాలోనే తయారు అవుతున్నట్లు స్పష్టం చేశారు. 

ఈ ఫోన్ ను  ముందే చెప్పిన విధంగా ఈ సంవత్సరం దీపావళికి వినియోగదారులకు అందిస్తామంటున్నారు.

నవంబర్ 4న జియో ఫోన్ నెక్ట్స్ ను మార్కెట్ లోకి తెస్తామన్నారు.