దంత సంబంధిత సమస్యల్లో పిప్పి పన్ను సమస్య బాగా ఎక్కువగా బాధిస్తుంటుంది.

ఈ సమస్య పెద్ద వాళ్ళతో పోల్చుకుంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది.

పిప్పి పన్ను వల్ల వచ్చే నొప్పి భరించలేనంతగా ఉంటుంది.

తిన్న ఆహారపదార్థాలు పిప్పి పన్నులో ఇరుక్కున్నప్పుడు నరకం కనబడుతుంది.

ఈ సమస్య నుంచి బయటపడడానికి పెయిన్ కిల్లర్స్ వాడతారు.

యాంటీ బయోటిక్ మందులు వాడతారు. అయినా శాశ్వత పరిష్కారం దొరకదు.

అయితే ఆయుర్వేద వైద్యం ద్వారా పిప్పి పన్ను సమస్యకు చెక్ పెట్టవచ్చు.

పిప్పి పన్ను సమస్యను తగ్గించడంలో సీతాఫలం పండు ఆకు కీలక పాత్ర పోషిస్తుంది.

సీతాఫలం ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.  

పిప్పి పన్ను సమస్యను తగ్గించే శక్తి సీతాఫలం పండుకి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఒక 3 సీతాఫలం ఆకులను తీసుకుని బాగా కడగాలి. కొన్ని మిరియాలు తీసుకుని.. సీతాఫలం ఆకులతో కలిపి నూరాలి.

ఆ నూరిన మిశ్రమాన్ని పిప్పి పన్ను సైజులో ముద్దలా చేసి.. పిప్పి పన్ను వల్ల ఏర్పడ్డ రంధ్రంలో ఉంచాలి.

ఇలా చేయడం వల్ల పిప్పి పన్ను బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

నోట్: పైన చెప్పిన చిట్కాలు పాటించేముందు ఓసారి డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.