చాలా మందికి మధ్యాహ్నం భోజనం చేశాక చిన్న కునుకుతీస్తే బాగుంటుంది.
ఈ మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి శ్రేయస్కరమా లేక హాని చేస్తాయా అనే
విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్త కునుకు తీస్తే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
మధ్యాహ్నం నిద్రతో ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఈ నిద్ర వల్ల షుగర్, థైరాయిడ్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
మధ్యాహ్నం నిద్ర వల్ల హార్మోన్లు చురుగ్గా పని చేస్తాయి. జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది.
డయాబెటిస్, పీసీఓడీ, థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.
మధ్యాహ్నం నిద్ర హైబీపీని నియంత్రిస్తుంది.
మధ్యాహ్నం నిద్ర కొవ్వును కరుగుతుంది
అయితే.., మధ్యాహ్నం నిద్ర ఎవరెవరు ఎంత సేపు పోవాలన్న దానికి ఓ లెక్క ఉంది
చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు గరిష్టంగా 90 నిమిషాలపాటు నిద్ర శ్రేయస్కరం.
ఆరోగ్యవంతులు, సాధారణ వ్యక్తులైతే 10 నుంచి గరిష్టంగా 30 నిమిషాలు కునుకు తీయడం ఆరోగ్యానికి మేలు
ఆఫీసులో ఉన్నవారైతే డెస్క్ మీద తలవాల్చి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.
చూశారు కదా? ఇవి మధ్యాహ్నం వల్ల ప్రయోజనాలు.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి