ఇండియాలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి.
ఆ మాటకొస్తే.. ప్రపంచంలోని టాప్ ఐటీ సంస్థల్లోనూ ఇన్ఫోసిస్ను ఒకటిగా చెప్పొచ్చు.
ఇన్ఫోసిస్ విజయం వెనుక, ఈ స్థాయికి చేరడం వెనుక దాని కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి పాత్ర ఎంతో కీలకం.
1981 నుంచి 2002 వరకు దాదాపు 21 ఏళ్లు ఇన్ఫోసిస్కు సీఈవోగా వ్యవహరించారు మూర్తి.
ప్రస్తుతం కాటమరాన్ వెంచర్స్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు ఎన్ఆర్ నారాయణ మూర్తి.
తాజాగా వీకెండ్లో ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు.
ఐఐఎం స్టూడెంట్స్తో తన జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మూర్తి.
కార్పొరేట్ రంగంలో ఎదగాలనుకునే వారు ఏం చేయాలి? ఆ రంగంలో లీడర్లు ఎలా ఉండాలో ఆయన సూచించారు.
జీవితంలో ఎన్ని విజయాలు అందుకున్నా ఒక విషయంలో మాత్రం తాను ఇప్పటికీ బాధపడతానన్నారు మూర్తి.
తన తల్లి ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో ఆమెను ఇన్ఫోసిస్కు ఆహ్వానించలేదన్నారు మూర్తి.
అమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు కంపెనీకి ఆహ్వానించడం తాను చేసిన తప్పన్నారు.
తల్లి విషయంలో తాను చేసిన ఈ తప్పుకు ఎన్ఆర్ నారాయణ మూర్తి పశ్చాత్తాపం చెందారు.
కార్పొరేట్ లీడర్ అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు.
తాము తీసుకోబోయే నిర్ణయాల వల్ల ప్రభావితమయ్యే వాటి గురించి, వాటితో నష్టపోయే పేదల గురించి కార్పొరేట్ లీడర్లు ఆలోచించాలని ఎన్ఆర్ నారాయణ మూర్తి సూచించారు.