దేశంలోనే మొట్టమొదటి అర్బన్ పాడ్ హోటల్ ముంబయిలో ప్రారంభమైంది.

ఈ హోటల్ ను IRCTC, భారతీయ రైల్వేస్ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి.

చిన్న పని మీద వచ్చి హోటల్ రూమ్ లకు ఎక్కువ డబ్బులు వృథా చేసుకునే పని లేకుండా.. ఇలా అర్బన్ పాడ్ అని రూమ్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

అంతర్జాతీయ ప్రాయాణీకులను ఆకర్షించేందుకు జపాన్ ప్రభుత్వం ఈ పాడ్ హోటల్ కాన్సెప్ట్ ను ప్రారంభించింది.

ఇప్పుడు అదే దారిలో ఇండియన్ రైల్వేస్ కూడా ఈ పాడ్ హోటల్ ను ముంబయిలో పరిచయం చేసింది.

ముంబయి సెట్రల్ లో మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన వెయింట్ రూమ్స్ లోనే ఈ పాడ్ హోటల్ ను ఏర్పాటు చేశారు.

ఈ పాడ్ హోటల్ లో వైఫై, టీవీ, వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్, సీసీ కెమెరాలు, కీకార్డ్ యాక్సెస్ వంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి.

మొత్తం 48 పాడ్స్ తో ఈ ‘అర్బన్ పాడ్’ హోటల్ ను ప్రారంభించారు. వాటిలో 30 క్లాసిక్ పాడ్లు, 7 ప్రైవేట్ పాడ్స్, ఒకటి వికలాంగుల కోసం కేటాయించారు.

క్లాసిక్ పాడ్, మహిళల స్పెషల్ పాడ్ కు 12 గంటలకు రూ.999 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు.

డిఫరెంట్లీ ఏబుల్డ్ వారికి కేటాయించిన పాడ్ ధరను 1500 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు.

ప్రైవేట్ పాడ్స్ ధరను రూ.1249 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు.

24 గంటలకు క్లాసిక్ పాడ్, మహిళల పాడ్స్ కు రూ.1999 వేలు ప్లస్ జీఎస్టీ, ప్రైవేట్ పాడ్స్ కు 2500 ప్లస్ జీఎస్టీ నిర్ణయించారు.

డిఫరెంట్ ఏబుల్డ్ పాడ్ కు 24 గంటలకు రూ.2999 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు.