వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు మానవ జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
ప్రధానంగా ఉరుములు, మెరుపులతో పాటు వచ్చిపడుతున్న పిడుగులు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడు తున్నాయి.
ఈ క్రమంలో పిడుగుబాటుకు గురై పలువురు మృత్యువాత పడుతుండగా, పలుచోట్ల మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి.
పైన చెప్పినట్లుగా తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు.. మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకొని కూర్చోండి.
దగ్గరగా ముడుచుకొని కూర్చుంటే పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మీపై తక్కువగా ఉంటుంది.
అలాగే ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది.