కొంతమంది భోజనం చేసిన తర్వాత నిద్రలోకి జారుకుంటారు.
అయితే వెంటనే నిద్రపోకుండా వాకింగ్ చేస్తే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి
ఇంట్లో లేదా బయట కొన్ని నిమిషాల పాటు నడిస్తే అనేకఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది.
భోజనం తర్వాత నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
భోజనం తర్వాత 15 నిమిషాలు నడిస్తే బ్లడ్ షుగర్ లెవల్స్ని తగ్గిస్తుంది.
భోజనం తర్వాత నడవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
భోజనం తర్వాత కొన్ని నిమిషాలు నడవడం వల్ల శరీర బరువు తగ్గుతుంది.
భోజనం తర్వాత నడవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
నడవడం వల్ల ఆహారంలోని పోషకాలు శరీరానికి అందుతాయి.
అయితే కొంతమందికి తిన్న వెంటనే నడవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి.
ఇలాంటి సమస్యలున్న వాళ్ళు భోజనం తిన్న 10-15 నిమిషాల తర్వాత నడిస్తే మంచిది.
సమస్యలున్న వారు వేగంగా కాకుండా నెమ్మదిగా నడవాలి
కనీసం 10 నిమిషాలైనా నడిస్తే రోజూ 30 నిమిషాల వ్యాయామం చేసిన దానితో సమానం.
అరుగుదల సరిగా లేకపోవడం, వికారం, డయేరియా, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.