వర్షాకాలం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షపు జల్లులు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అయితే తరచూ కురిసే జల్లులతో వాతావరణం తడిగా ఉంటుంది.
వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు, తరచూగా జలుబు, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తి పెంచుకోవడంలో పసుపు ఎఫెక్టివ్గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పసుపులో విటమిన్లు, మినరల్స్, మాంగనీస్, ఐరన్, ఫైబర్, విటమిన్ బి6, కాపర్, పొటాషియం ఉంటాయి.
పసుపులో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీఫంగల్ వంటి ఎన్నో గుణాలు ఉన్నాయి.
జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
తులసి, పసుపు టీ..
తులసి, పసుపులో ఔషదాలు మెండుగా ఉంటాయి.
తులసి, పసుపు టీ..
వర్షాకాలంలో పసుపు , తులసి , కషాయాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా జలుబు , గొంతు సమస్యను అధిగమించడానికి సహాయపడతాయి.
ఓ గిన్నెలో పోసి రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చెయ్యాలి. అందులో చిటికెడు పసుపు వేసి బాగా మరగనివ్వాలి.
ఆ తర్వాత కాసింత టీ పొడి వేసి చిన్నమంటపై అలానే మరగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి.. అందులో కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం, చెంచాడు తేనె వేసి కలపాలి. అంతే పసుపు టీ రెడీ.
దీన్ని రోజు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. అధికబరువు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.
దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గ్లాసుడు పసుపు పాలు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
గ్లాసుడు పాలను స్టవ్ మీద పెట్టి చెంచాడు పసుపు, చెంచాడు తేనె, కొద్దిగా నెయ్యి, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలిపి తక్కువ మంట మీద కాసేపు మరగనివ్వాలి.
ఒంటి నొప్పులు, జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు పసుపును తీసుకోవడం వల్ల నొప్పులు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.
దీంట్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మంట, వాపులను నిరోధిస్తాయి.