రాజకీయ నేతల్లో చాలా కొందరు మాత్రమే.. పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకుంటారు.
సోషల్ మీడియా వేదికగా మంచి చేసే వారిని అభినందించడం, సాయం కోరే వారికి, సమస్యలకు పరిష్కారం చూపడంలో ముందుంటారు.
తాజాగా తన కుమారుడిని ఉద్దేశిస్తూ.. హరీష్ రావు చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కుమారుడు గ్రాడ్యూయేషన్ డే సందర్భంగా తీసిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు హరీష్ రావు.
హరీష్ రావు కుమారుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి.. పట్టా అందుకున్నాడు.
ఈ మేరకు అమెరికాలోని కొలరాడో కౌంటీ బౌల్డర్లో యూనివర్సిటీ స్నాతకోత్సవం జరగింది.
హరీష్ రావు ఈ వేడుకలో పాల్గొనడం కోసం అమెరికా వెళ్లారు.
ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అర్చిష్మాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు.
ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు.