IPL ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్ వెలుగులోకి వస్తున్నారు.
అలా వచ్చిన వారు తమ అద్భతమైన ఆటతీరుతో తక్కువ టైమ్ లోనే జాతీయ జట్టులో స్థానం సంపాదించుకుంటున్నారు.
ఇలా జట్టులో స్థానంతో పాటుగా IPLలో గట్టిగానే సంపాదిస్తున్నారు ఇండియన్ ప్లేయర్స్.
వీరిలో ముందు వరుసలో ఉన్నాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్
హార్దిక్ పాండ్యా.
ఐపీఎల్ లో ఏ రేంజ్ లో పాండ్యా జీతం పెరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పాండ్యాను
2015లో
ముంబై ఇండియన్స్
కేవలం
10 లక్షల
బేస్ ప్రైస్ తో దక్కించుకుంది.
అలా వరుసగా 2016, 17లో కూడా అదే ధరకు అంటే
10 లక్షలకే
అతడిని కొనుగోలు చేసింది
ముంబై ఇండియన్స్.
ఆ తర్వాత అద్భుతమైన ఆట ఆడటంతో 2018లో ఏకంగా
11 కోట్లు
పెట్టింది
ముంబై.
పాండ్యాకు 2019, 20, 21 లలో కూడా
11 కోట్లు
చెల్లించింది
ముంబై ఇండియన్స్.
అనంతరం
పాండ్యా
ప్రదర్శనకు మంత్రముగ్దులైంది కొత్త ప్రాంఛైజీ
గుజరాత్ టైటాన్స్.
2022లో జరిగిన మెగా వేలంలో పాండ్యాను ఏకంగా
15 కోట్లకు
కొనుగోలు చేసింది.
దానికి తగ్గట్లుగా తొలి సీజన్ లోనే
గుజరాత్ కు
ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.