రోజురోజుకి పెరుగుతూ పోతున్న పెట్రోల్ ధరకి అస్సలు బ్రేక్ పడటం లేదు. దేశంలో ఇప్పుడు తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.100 దాటిపోయింది.
ఇప్పుడు ఈ ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం భారీ యాక్షన్ ప్లాన్ కి తెర తీసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్-డీజిల్ పై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించే పనిలో పడింది.
ఇందుకోసం రానున్న కాలంలో యూరో -6 ఉద్గార ప్రమాణాల ప్రకారం ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లను ఉత్పత్తి చేయాలని..
వాహన తయారీదారులను ప్రభుత్వం కోరబోతుంది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం.
ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ కి, పెట్రోల్ రేటు తగ్గడానికి మధ్య లింక్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు కిటుకు.
ఫ్లెక్సిబుల్ ఇంధనం అనేది గ్యాసోలిన్ , ఇథనాల్ కలయికతో తయారు చేయబడిన ప్రత్యామ్నాయ ఇంధనం.
రానున్న కాలంలో కంపెనీలు అన్నీ ఈ ఇంజిన్ ఉన్న వాహనాలు డిజైన్ చేసుకుంటే.. పెట్రోల్-డీజిల్ తో అవసరం ఉండదు.
ఈ ఇథనాల్ ధర లీటరుకు 60-62 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్ మాత్రం పక్కాగా అమలు చేయగలిగితే ప్రజలకు పెట్రోల్, డీజిల్ ని అధిక ధరకి కొనాల్సిన బాధలు తప్పుతాయి.
రానున్న ఏడాది కాలంలోనే ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ప్రధాని మోదీ పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.
మరి.. రూ.60కే లీటర్ పెట్రోల్ వచ్చే ఈ యాక్షన్ ప్లాన్ సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.