వర్షాకాలం మొదలవగానే  వాతావరణంలో  ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి.

ఈ క్రమంలోనే ఎన్నో వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి.

ముఖ్యంగా వర్షాకాలం మొదలవగానే జ్వరం, దగ్గు, జలుబు, వంటి అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.

మరి వర్షాకాలంలో ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.

వర్షాకాలం మొదలవగానే చాలామంది బజ్జీలు, పకోడీలు వంటి ఆహార పదార్ధాలను తినడానికి ఇష్టపడుతుంటారు.

ఈ విధంగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి.

వర్షాకాలంలో ఆకుకూరలకు ఎక్కువగా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 

కనుక వర్షా కాలంలో ఆకుకూరల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

వర్షా కాలంలో హెర్బల్ టీ లేదా కషాయాలను తాగ‌డం ద్వారా మీ రోగనిరోధక శక్తిని మరింత శక్తివంతంగా మెరుగుప‌డుతుంది.

అంటువ్యాధులతో పోరాడటానికి అల్లం-వెల్లుల్లి బాగా ఉపయోగపడుతాయి.

నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మకాయల్లో ఉన్న ‘విటమిన్ సీ’ అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని ర‌క్షిస్తుంది.

వర్షాకాలంలో సలాడ్లు తీసుకోవడం మానేయాలి. అలాగే చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారపదార్థాలను తీసుకోవడం మానేయాలి.

వర్షా కాలంలో తాగే నీటిని కచ్చితంగా వేడి చేసుకుని తాగాలి. 

వర్షా కాలంలో జలుబు చేస్తే అంత సులభంగా తగ్గే అవకాశం  ఉండదు. కాబట్టి స్వీట్స్ అవైడ్ చేస్తే మంచిది.

వర్షా కాలంలో ఆహారం విషయంలో  తీసుకుంటే.. ఆరోగ్యంగా ఉండవచ్చు.