మధ్యాహ్నం పూట కొన్ని రకాల ఆహార పదార్థాలను తింటే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఉదయం భోగి, మధ్యాహ్నం యోగి, రాత్రి రోగిలా తినాలని పెద్దలు చెప్పిన మాట.

అయితే, ఉరుకుల పరుగుల జీవితం కారణంగా ఉదయం అల్పాహారం తినడానికి కూడా కొంతమందికి తీరిక ఉండటం లేదు. 

ఈ నేపథ్యంలో ఒకేసారి మధ్యాహ్నం భోజనం తినేస్తున్నారు. 

అది కూడా రెండు పూటలకు సరిపడా ఆహారాన్ని తినేస్తున్నారు. 

ఇలాంటప్పుడు మనం తీసుకునే ఆహారం ఎంతో బలవర్థకంగా ఉండాలి.

మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచాలి. 

కానీ, మధ్యాహ్నం పూట కొన్ని రకాల ఆహార పదార్థాలను తింటే ఆరోగ్యం పాడవటం ఖాయం. అవేంటంటే...

నూడుల్స్, పాస్తా: మధ్యాహ్నం పూట పాస్తా, నూడుల్స్ మొదలైనవి తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. 

దానితో పాటు జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. 

జ్యూస్‌లు: జ్యూస్‌లను మధ్యాహ్నం తాగటం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. 

బర్గర్లు: బర్గర్లు, పిజ్జాలు, శాండ్ విచ్‌ల వంటి వాటిని మధ్యాహ్న భోజనంగా తీసుకోవటం వల్ల బరువు పెరగటంతో పాటు మన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.

సూప్‌లు: సూప్‌లను మధ్యాహ్నం పూట తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.