టాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే జంట నరేష్, పవిత్ర లోకేశ్.

కొన్ని రోజులుగా ఈ జంట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా వీరి వార్తలే. 

 కొన్నేళ్ల నుండి సహజీవనంలో ఉన్న ఈ జంట.. సడన్‌గా లిప్ లాక్ వీడియోతో ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేశారు. అనంతరం మళ్లీ పెళ్లి అనే సినిమాను ప్రకటించారు.  

అయితే తాము పెళ్లి చేసుకున్నామనే అర్థం వచ్చేలా నరేష్ చేసిన ట్వీట్ పెను సంచలనం అయిన సంగతి విదితమే. 

అనంతరం వీరిద్దరూ హనీమూన్‌కు వెళ్లారంటూ ఓ వీడియో హల్ చల్ చేసింది.

 మళ్లీ పెళ్లి సినిమా టీజర్ విడుదల చేయడంతో.. అదంతా సినిమా ప్రమోషన్‌లో భాగమని తేలిపోయింది. 

తన నిజ జీవిత సంఘటనలతో ఈ సినిమాను చిత్రీకరించినట్లు ప్రేక్షకులకు ఇట్టే తెలిసిపోతుంది.

తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నరేష్ మాట్లాడుతూ తన నిజ జీవిత గాథ కాదని, అందరికీ కనెక్ట్ అయ్యే కథ అంటూ చెప్పారు.

మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా అనే విషయంపై నరేష్ ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పడు ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.

ప్రస్తుతం ఆయన మంచి శకునములే అనే సినిమాలో నటిస్తున్నారు. 

మే 18న విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తుంది.

సంతోష్ శోభన్, మాళవిక జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

నాని, దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. 

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. పవిత్రనుద్దేశించి కొన్ని ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. 

అలాగే ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు క్లిక్ మనగా.. నరేష్ ఫోన్‌పై చూపు పడింది. అందులో డిసీ ప్లే ఆన్ అవ్వగా.. అందులో నరేష్, పవిత్ర ఫోటో కనిపించింది.

వారిద్దరి ఫోటోనే ఆయన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఎంత స్ట్రాంగో అంటూ కామెంట్లు వస్తున్నాయి.