కానీ జాతీయ పోషాకాహార సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం రోజుకు 6 గ్రాముల ఉప్పును ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
శరీరంలో సోడియం ఎక్కువైతే కాల్షియం శాతం తగ్గి ఎముకలు డొల్లబారి కీళ్ల నొప్పుల సమస్యలు తలెత్తుతాయి.
అంతేకాక మెదడులో ఆక్సిజన్ శాతం తగ్గి.. బ్రెయిన్ కణాలు దెబ్బ తింటాయి. ఫలితంగా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.
ఉప్పును అధికంగా తీసుకుంటే.. మూత్రపిండాలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అందువల్ల అవి దెబ్బ తినే అవకాశం ఎక్కువ.