ఎంతో మంది తమ పేదరికాన్ని ఎదుర్కొన్ని జీవితంలో విజయం సాధించారు.

అలా కష్టపడి విజయం సాధించిన వారిలో తమిళనాడుకు చెందిన రమ్య ఒకరు.

ఆర్. రమ్య అనే22 ఏళ్ల యువతి ఓ రైతు కుటుంబంలో జన్మించింది.

తమిళనాడులోని సేలంలో రమ్య పుట్టి..పెరిగింది. అక్కడే నమక్కల్ లో లిటరేచర్ చదివారు.

తమిళనాడులోని సేలంలో రమ్య పుట్టి..పెరిగింది. అక్కడే నమక్కల్ లో లిటరేచర్ చదివారు.

ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. రమ్య కుటుంబంలో ఆమెనే తొలి గ్రాడ్యుయేట్.

కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసిన రమ్య కష్టపడి ఐఐఎంలో చేరి బాగా చదివారు.

చివరకు అంతర్జాతీయ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించుకున్నారు.

క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏడాదికి రూ. 64.15 లక్షల ప్యాకేజీతో జాబ్ కొట్టారు.

నైజీరియాలో ఉన్న తోలారం గ్రూప్ కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది.

తోలారం గ్రూప్ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాసై ఉద్యోగానికి ఎంపికయ్యారు.

నైజీరియాలోని తోలారం కంపెనీలో సేల్స్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది

తనను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఫ్యాకల్టీకి రుణపడి ఉంటానని ఆమె అన్నారు.

అలానే ఈ విజయం తన తల్లిదండ్రులదేనని రమ్య అన్నారు.

తన తల్లిదండ్రులు రైతులని.. ఏ పని చేసినా రాణించేలా  వాళ్ళే  ప్రభావితం చేశారని అన్నారు.

తమ గ్రామంలోని ఆడపిల్లలు చదువు కోసం బయటకు వెళ్లేవారు కాదని తెలిపింది.

తన  తల్లిదండ్రులు మాత్రం తనను ఎంతగానో ప్రోత్సహించారని రమ్య తెలిపారు.