భోజనం చేసే సమయంలో చాలా మంది సహజంగానే కొన్ని నీళ్లను తాగుతుంటారు.

అయితే కొందరు మాత్రం భోజనం చేసినంత సేపు నీళ్లను అదే పనిగా తాగుతూనే ఉంటారు. 

వాస్తవానికి భోజనం చేసే సమయంలో నీళ్లను అసలు తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది. 

తినేటప్పుడు నీళ్లు తాగడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నం తినే సమయంలో నీళ్లను తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు.

అలా ఆహారం జీర్ణం కాకపోతే గ్యాస్ సమస్య, అజీర్తి వంటివి ఏర్పడతాయి. 

భోజనం మధ్యలో నీళ్లను తాగడం వల్ల జీర్ణాశయంలోని ఎంజైమ్ల పనితీరు మందగిస్తుంది. 

ఎంజైమ్ ల  పనితీరు మందగిస్తే ఇక ఎప్పుడు ఆహారం తిన్నా.. అది సరిగ్గా జీర్ణం కాదు. 

జీర్ణం కాని ఆహారం కొవ్వుగా మారి.. శరీరంలో నిల్వ ఉంటుంది.

అన్నం తినే సమయంలో నీళ్లను తాగితే శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. 

శరీరంలో పేరుకపోయిన విష పదార్థాల వలన ఇన్ఫెక్షన్లు వస్తాయి.

ఆహారం తినే సమయంలో నీరు తాగడం వలన డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

 భోజన సమయంలో నీరు తాగడం వలన ఇంకా మరేన్నో సమస్యలు వస్తాయి.

కనుక అన్నం తినే సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ నీళ్లను తాగరాదు.

భోజనానికి 30 నిమిషాల ముందు లేదా చేశాక 30 నిమిషాల తరువాత నీళ్లను తాగాలని ఆయుర్వేదం చెబుతోంది.