మానవ శరీరానికి నీరు ఎంతో అవసరం. శరీరాన్ని ఆరోగ్యాంగా ఉంచడంలో  నీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది

అయితే.. నీళ్లను తాగడంలో కూడా పద్దతులున్నాయనే విషయం ఎంతమందికి తెలుసు!

ఆ పద్దతుల ప్రకారం తాగితేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు నిపుణులు

సాధారణంగా చాలామంది నీళ్లను నెగ్లెట్ చేస్తూ. తక్కువగా తాగుతుంటారు.. దానివల్ల డిహైడ్రేట్ అయిపోతుంటారు

నీళ్లను సరిగ్గా తాగకపోతే.. శరీరంలో నీటి స్థాయి తగ్గి ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది

నీళ్లను ఎక్కువ తాగకపోతే బలహీనత, జుట్టురాలడం, మలబద్దకం, చర్మం పాలిపోవడం వంటివి జరుగుతుంటాయి

అయితే.. నీళ్లను తాగడానికి పద్ధతులు ఉన్నాయని, నిలబడి అసలు తాగకూడదని అంటున్నారు నిపుణులు

నీళ్లను కూర్చొని తాగడమే ఉత్తమనని సూచిస్తున్నారు.. మరి ఎందుకో చూద్దాం!

నీళ్లను నిలబడి తాగడం వల్ల కడుపులోకి చాలా వేగంగా వెళ్తుంది. దీంతో జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది

కూర్చొని నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగు పడుతుంది.. అలాగే కణాలకు కూడా నీరు అందుతుంది

నిలబడి నీళ్లను తాగితే మూత్రపిండాలకు మంచిది కాదట.. దీంతో రక్తం నుంచి విషపదార్థాలను తొలగించడం కష్టమై కిడ్నీ సమస్యలు ఏర్పడే అవకాశము ఉందట

నీళ్లను నిలబడి తాగితే అన్నవాహికపై ప్రభావం పడుతుంది.. దీంతో లంగ్స్, శ్వాసకోశ వ్యవస్థపై  ఎఫెక్ట్ పడి, గుండె సమస్యలకు దారితీస్తుందట

నిలబడి నీళ్లను తాగడం వల్ల కీళ్లు, ఎముకలపై ప్రభావం పడుతుందని.. ఇలా చేస్తే కీళ్లు అరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు