మనం ప్రతి రోజూ తీసుకునే టిఫిన్స్లో ఇడ్లీది ఓ ప్రత్యేకస్థానం.
నూనె అస్సలు వాడరు కాబట్టి చాలా మంది ఇడ్లీలను తినటానికి ఇష్టపడుతుంటారు.
కొంతమంది సాధారణంగానే ఇడ్లీలంటే చాలా ఇష్టం.
ఇక, మనం ఎంతగానో ఇష్టపడే ఇడ్లీకి ఘనమైన చరిత్రే ఉంది.
ఈ ఇడ్లీ 7-12 శతాబ్ధం మధ్య కాలంనుంచే అందుబాటులో ఉంది.
అందరూ అనుకున్నట్లు ఇడ్లీ భారత్కు చెందినది కాదు.
ఇడ్లీ మొట్ట మొదటి సారి ఇండోనేషియాలో తయారు అయింది.
దీన్ని అక్కడి భాషలో కెడ్లి, కెడరీ అని అంటారు.
ఆ కాలంలో హిందూ రాజులు ఇండోనేషియాను పరిపాలించేవారు. అక్కడినుంచి ఇక్కడకి వచ్చినపుడు వంటగాళ్లను కూడా వెంట తెచ్చుకునేవారు.
ఇక్కడికి వచ్చినపుడు కూడా బంధుమిత్రులతో కలిసి ఇడ్లీ చేయించుకు తినేవారు.
ఇండోనేషియాకు చెందిన కెడ్లీ కాస్తా ఇండియాకు వచ్చి ఇడ్లీగా మారిపోయింది.
ఈ విషయాలను కర్ణాటకకు చెందిన ఆహార చరిత్రకారుడు కేటీ ఆచార్య వెల్లడించారు.