చాలా మందికి ఆరోగ్యం మీద శ్రద్ద ఉండదు. దాంతో ఏది పడితే అది తింటుంటారు.

ఈ విధంగా తినడం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే వీలుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే కొంత మంది మాత్రం ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడతారు. 

వారు ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం తేనెను తమ ఆహారంలో చేర్చుకుంటారు.

తేనెను రోజూ తింటే ఏ ఇబ్బంది లేదు కానీ..

కొన్ని  ఆహారపదార్థాలతో కలిపి తీసుకుంటే మాత్రం సమస్య తప్పదు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

తేనెను ఏ పదార్థాలతో కలిపి తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనెను వేడి పాలతో కలుపుకుని అస్సలు తాగకూడదు. 

ఇలా సేవిస్తే.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

తేనెను తరచుగా వేడి చేయకూడదు అని, వేడి పదార్థాలతో కలిపి తీసుకోరాదని వైద్యులు సూచిస్తున్నారు.

వేడి వేడిగా ఉన్న నిమ్మకాయ రసంతో కలిపి తేనెను తాగకూడదు.

అలాగే వేడి టీతో కలిపి తేనెను సేవించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.