సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులు, నియమాలను ఆచరిస్తుంటారు. సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయరు.

వాటికి కారణాలు తెలియకపోయినా పెద్దోళ్లు చెప్పారు కదా అని మనం కూడా పాటిస్తుంటాం.

ఇవి వాళ్లు చాదస్తంతో చెప్పినవి కాదు.. కొన్ని గ్రంధాల్లో ప్రస్తావించినవి.

సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం వల్ల మనకు దురదృష్టం కలుగుతుందని చెబుతారు. ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తుంటారు.

అలానే వాస్తు శాస్త్రంలో పేర్కొన్న చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని సూర్యాస్తమయం తర్వాత చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట.

అలానే భాగ్యలక్ష్మి మద్దతు ఉండకుండా పోతుందని చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఏం చేయకూడదో తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత పసుపు ఎప్పుడూ దానం చేయకూడదట. ఎందుకంటే పసుపును శుభ కార్యాలలో ఉపయోగిస్తారు.

మరోవైపు, పసుపు నేరుగా బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. ఇలా సాయంత్రం పసుపును దానం చేస్తే బృహస్పతి అభీష్టం వల్ల ఇంట్లో డబ్బు వృద్ధి నిలిచిపోతుందట.

చీపురు లక్ష్మి స్వరూపం. అందుకే సాయంత్రం ఇంట్లో చెత్త శుభ్రం చేయకూడదని చెబుతారు.  ఇంట్లో చెత్తాచెదారం ఉంటే సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీదేవి ఇంటికి రాదని చెబుతారు.

సాయంత్రం దానం చేయడం మానుకోవాలి. పాలు, పెరుగు, పసుపు, పంచదార లాంటివి దానంగానీ, ఇతరులకు గానీ ఇవ్వకూడదు. ఇది కూడా లక్ష్మీదేవికి కోపాన్ని కలిగిస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చీకటి పడిన తర్వాత స్నానం చేయకూడదు. ఇది లక్ష్మీదేవికి కోపాన్ని తెప్పిస్తుంది. సాయంత్రం స్నానం చేయడం, నుదుటిపై తిలకం పెట్టుకోవడం కూడా నిషేధం.

సూర్యాస్తమయం టైంలో నిద్రపోకండి. దీని వల్ల దేవతల ఆశీర్వచనాలు ఉండకపోగా రాక్షస బుద్ధి పెరుగుతుంది. ఆరోగ్యంపైనా కూడా చెడు ప్రభావం చూపిస్తుంది.

ఇంటిని చీకటిగా ఉంచొద్దు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం పెరుగుతుంది. ఇల్లంతా వెలుగుతో ఉంటే నెగిటివ్ ఎనర్జీ దరిచేరదు.

అందుకే సంధ్యా సమయంలో ఇంటిని అస్సలు చీకటిగా ఉంచకూడదు. కుదిరితే దేవుడి దగ్గర, ఇంటి ద్వారం దగ్గర ఈ సమయంలో దీపం వెలిగించడం శుభ ఫలితాలనిస్తుంది.

చీకటి పడిన టైంలో జుట్టు, గోళ్లను ఎప్పుడూ కత్తిరించవద్దు. దీనివల్ల డబ్బు లేకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

నోట్: పైన పాయింట్స్, మాకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాశాం. యూజర్స్ గమనించగలరు.