నేటికాలంలో ఎక్కువ మంది ఉద్యోగాల కంటే వ్యాపారంపైనే ఆసక్తి ఉంటుంది.
అలాంటి వారికోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది.
వ్యాపారం చేయాలనుకునే వారు సున్న వడ్డీతో రూ.3 లక్షల వరకు లోన్ పొందవచ్చు.
అంతేకాక ఈ రుణంలో 50 శాతం వరకు సబ్సిడీ కూడా లభిస్తుంది.
అయితే పథకంలో కేవలం మహిళలకు మాత్రమే లోన్ ఇస్తారు.
ఈ పథకం కింద మీరు మీ దగ్గర్లో ఉన్న ఏ బ్యాంకుకైనా వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
ఎలాంటి హామీని కూడా చూపించాల్సిన లేకుండానే రూ.3 లక్షల వరకు రుణం లభిస్తుంది.
25 నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న మహిళలు మాత్రమే ఈ రుణం కోసం అప్లయ్ చేసుకోవాలి.
కేంద్రం ఇచ్చే ఈ పథకంలో 88 రకాల వరకు వ్యాపారల కోసం మహిళలు లోన్ తీసుకోవచ్చు.
ఈ పథకంలో జీరో వడ్డీ, సబ్సిడీ అందరికీ ఇవ్వరు.
ఎస్సీ, ఎస్టీ, హ్యాండీక్యాప్డ్ మహిళలకు మాత్రమే ఈ సున్నా వడ్డీ లభిస్తుంది.
అలానే సబ్సిడీ వితంతువు, హ్యాండీక్యాప్డ్ మహిళలకు 30 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది.
మీరు కట్టాల్సిన రుణంలో 30 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
రుణం తీర్చేందుకు ఆరు ఏళ్ల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు.