మధుమేహం ఉన్న తల్లులు, పిల్లలకు పాలివ్వడానికి భయపడుతుంటారు.

అయితే కొన్ని చిట్కాల ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.

పిల్లలకు పాలిచ్చే తల్లులు పోషకాహారం తినాలి.

పిల్లలకు పాలిచ్చిన తర్వాత మధుమేహం ఉన్న మహిళల బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. 

ఆ సమయంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలి.

ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పడిపోతే పాలిచ్చే ముందు చిరు తిండ్లు తినడం మంచిది.

పాలిచ్చిన తర్వాత దాహం వేస్తే అవసరమైన మేరకు నీరు తాగాలి.

శిశువు నిద్రపోయిన సమయంలో తల్లి కూడా నిద్రపోతే మంచిది.

దీని వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం లేకుండా ఉంటుంది.

మధుమేహం ఉన్న తల్లులు ఒక రొమ్ము నుండే కాకుండా రెండు రొమ్ముల నుంచి పాలివ్వాలని వైద్యులు చెబుతున్నారు.

దీని వల్ల పుండ్లు పడే అవకాశం తక్కువ ఉంటుందని అంటున్నారు.

ఒకవేళ పుండ్లు ఎక్కువ వస్తే వైద్యులని సంప్రదించాలి.

మధుమేహం ఉన్న తల్లులు ఎల్లప్పుడూ ఒత్తిడి లేకుండా రిలాక్సిడ్గా ఉండాలి.

ఇలా చేస్తే పాలిచ్చే తల్లులు షుగర్ లెవల్స్ను కంట్రోల్లో ఉంచుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.