1897 నుంచే బ్రిటీషర్లకు నిద్రలేకుండా చేసిన ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా గురించి నేటి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అక్కడ ఆయన పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నారు. ఫలితంగా బ్రిటిష్ పాలకుల అణిచివేత, దోపిడిని అర్థం చేసుకున్నాడు.
ఇక అక్కడి నుంచి తనజాతి వారి కోసం బ్రిటిషర్లతో పోరాటం చేశారు బిర్సా. ఆదివాసీ యవతను చైతన్యం చూస్తూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషిం చారు.
బ్రిటిష్ సాయుధ బలగాలు దుంబర్ హిల్ అనే పర్వత ప్రాంతంలో ‘బిర్సా ముండా’పైన కాల్పులు జరిపారు. ఆ ఘటనలో చాకచక్యంగా తప్పించుకున్నారు బిర్సా.
జంకోపాయి అడవిలో 3 మార్చి 1900న అరెస్ట్ అయ్యారు. 460 మంది ఆదివాసీ ప్రజలను 15 క్రిమినల్ కేసుల్లో బ్రిటిషర్లు అక్రమంగా ఇరికించారు.