మన వంటగదిలోనే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయగల మూలికలు ఉన్నాయి.

మన పెద్దలే కాకుండా ఆయుర్వేద నిపుణులు కూడా వంటగది మసాలా దినుసులు, మూలికలను ప్రతిరోజూ వాడాలని సూచిస్తుంటారు.

మెంతి గింజలు  ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

మెంతులలో పీచు పదార్ధం సమృద్ధిగా వుంటుంది

మెంతి ఆకుల్లో ఇనుము ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి.  

యాంటీ యాక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

మెంతులను రకరకాలుగా వాడుతుంటారు

మెంతులు వంటకాల రుచిని పెంచడంతోపాటు మధుమేహాన్ని నియంత్రించగలవు.

బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు ఉత్పత్తి పెరుగుతుంది.

మహిళల్లో యుటేరియన్ కాంట్రాక్షన్ స్టిములేట్ చైల్డ్ బర్త్ ను సులభతరం చేస్తుంది. ఇది లేబర్ పెయిన్(ప్రసవ నొప్పులను)తగ్గిస్తుంది.

మెంతుల్లో డే సపోనిన్స్‌లో ఫైటోఈస్ట్రోజన్స్ తయారీకి అవసరమైన ప్రికర్సార్లు 

డోయోస్‌జెనిన్స్ అనేవి మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

ఒక చెంచా మెంతులను మీ భోజనంలో తీసుకోవడం ద్వారా ఎసిడిక్ రిప్లెక్షన్ మరియు హార్ట్ బర్న్ తగ్గిస్తుంది.

మెంతులు టైప్ 1, టైప్ 2 మధుమేహాలు రెండింటిలోనూ ఔషధంగా పని చేస్తుంది. మెంతుల్లో ఉండే ట్రైగోనెల్లిన్, కౌమారిన్ అనే తత్వాలు మధుమేహం మీద పని చేస్తాయి.

మధుమేహ నియంత్రణ కోసం మెంతులను రోజుకి 50 గ్రాములను, రెండు మూడు డోసులుగా విభజించి తీసుకోవాల్సి ఉంటుంది.

మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.

మెంతులను తేనె,  నిమ్మరసంతో కలిపి తీసుకుంటే జ్వరం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గొంత సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

మెంతుల్లో ఉన్న ఫైబర్ కంటెంట్ శరీరం లోని టాక్సిన్స్ ను తగ్గించి శరీరాన్ని న్యూరిష్ చేస్తుంది.