సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్ ఇలా అంశం ఏదైనా వార్తాపత్రికల్లో సెటైరికల్ గా చెప్పాలంటే కార్టూన్లను మించి మరొకటి ఉండేది కాదు.
కానీ ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియాను వాడుకుంటూ చాలా మంది తమ టాలెంట్ను నిరూపించుకుంటున్నారు.
ఈ క్రమంలో బాగా పాపులర్ అయినవే మీమ్స్.
సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లోని ప్రముఖుల ఫొటోలు, డైలాగుల సాయంతో నెటిజన్లు సంధించే సెటైర్లు మామూలుగా ఉండవు. అవి బాగా వైరల్ అవుతున్నాయి.
సెలబ్రిటీల డైలాగులను పంచ్ లైన్లుగా వాడుతూ చేసే మీమ్స్కు యూత్లో మంచి క్రేజ్ ఉంది.
యువతకు చేరువయ్యేందుకు మీమ్స్ ఇప్పుడో మార్గంగా మారింది.
ఇప్పటికే రాజకీయ ప్రచారాల్లో, బిజినెస్ అడ్వర్టయిజ్మెంట్లలో ఈ ట్రెండ్ బాగా కనిపిస్తోంది.
యువత నాడిని పట్టేసిన బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ మీమ్స్ చేసేవారికి క్రేజీ ఆఫర్ ఇచ్చింది.
తమ కంపెనీలో మీమ్స్ ఆఫీసర్గా చేరితే నెలకు రూ.లక్ష జీతం ఇస్తామని స్టాక్ గ్రో అనే సంస్థ ప్రకటించింది.
యువతను ఆకట్టుకునేలా మీమ్స్ చేస్తే జాబ్ ఇస్తామంటూ లింక్డ్ఇన్లో స్టాక్ గ్రో ఓ ప్రకటన చేసింది.
మీమ్స్ ఎక్స్పర్ట్లను వెతికి పట్టుకునేందుకు సహకరించిన వారికి ఒక ఐప్యాడ్ గిఫ్ట్గా ఇస్తామని ఊరిస్తోంది స్టాక్ గ్రో.
మీలో గనుక మంచి మీమ్స్ చేసే ప్రతిభ ఉంటే వెంటనే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి.