సీతపహరణ గావించిన రావణాసురుడి పది తలలను శ్రీరాముడు నరికి చంపిన సందర్భంగా హిందు సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు.

అశ్వీని నక్షత్రంలో కలిసి వచ్చిన పూర్ణిమ మాసమే అశ్వమునిమాసం అవుతుంది. 

దేవి నవరాత్రులను శరన్నావరాత్రులుగా పిలుస్తూ నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు.

దుర్గాదేవిని పూజిస్తూ భక్తితో కొలుస్తుంటారు. వాడ వాడన దుర్గాదేవి విగ్రహాలు పెట్టి భక్తి శ్రద్దలతో కొలుస్తుంటారు.

ఎంతో భక్తి శ్రద్దలతో కొలిచే ఈ నవ రాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి పూజలు చేయాలి?

 దుర్గాదేవి అనుగ్రహం దక్కడం కోసం జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు ఏం చెబుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.

దుర్గాదేవి విగ్రహాన్నిఉంచే ముందు వాస్తు, పూజ గది తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండే విధంగా చూసుకోవాలి.

గుడి గుమ్మానికి మామిడి ఆకులను వేలాడదీయాలి. ఇలా మామిడి ఆకులను వేలాడ దీయడం ద్వారా దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

ఈ పండగ సందర్భంగా అఖండ జ్యోతిని వెలిగించాలి. ఆ అఖండ జ్యోతి నేలపై పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఈ నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా తులసి మొక్కను ఈశాన్య దిశలో నాటాలి.

ప్రతీ రోజూ స్నానం చేసి విశ్వాసంతో భక్తి శ్రద్దలతో దుర్గాదేవిని పూజించాలి.

దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఇలా చేయడం ద్వారా దుర్గాదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు.