ఆడవాళ్ల జీవితంలో ప్రతి ఒక్కటీ పరీక్షే. వాటిలో ముఖ్యమైనది.. ఎంతో బాధించేది నెలసరి.
అవును పిరియడ్స్ అనేవి ఆడవాళ్ల జీవితంలో ఒక అగ్ని పరీక్షలాంటిది. వారికి ప్రతినెలా ఈ నెలసరి బాధ తప్పదు.
ఈ సమయంలో నడుం నొప్పి, కడుపు నొప్పి, పొత్తికడుపులో నొప్పి రావడం, కాళ్లు లాగడం, నిలబడలేకపోవడం, నీరసంగా ఉండటం, మూడ్ స్వింగ్స్, చిరాకు అన్నీ వస్తుంటాయి.
ఈ పిరియడ్స్, ఆ సమయంలో వచ్చే నొప్పులు కారణంగా ఆడవాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
నెలసరి సమయంలో ఆడవాళ్లకు రక్తస్రావం అవుతుందని అందరికీ తెలిసిందే.
నెలసరి సమయాల్లో గర్భాశయం సంకోచించడం స్టార్ట్ అవుతుంది.
గర్భాశయం పొరలోని ధమనులు మూసుకుపోతాయి. అప్పుడు నొప్పిని కలిగించే రసాయనాలు విడుదల అవుతాయి.
అయితే ఈ నొప్పులతో వచ్చే బాధను మాటల్లో వర్ణించలేము.
కొందరైతే ఆ నొప్పులు తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ ని వేసుకుంటూ ఉంటారు.
అలా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడితే పిరియడ్ సైకిల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ నొప్పులను అధిగమించేందుకు సింపుల్ చిట్కాలను వాడాలని పెద్దలు చెబుతూ ఉంటారు.
జూహి కపూర్ అనే ఒక న్యూట్రీషియన్ సింపుల్ రెమిడీని సూచించారు. ఈ మిశ్రమాన్ని తాగితే నిమిషాల్లో నెలసరి నొప్పులు పోతాయంటూ చెబుతున్నారు.
ఒక టీ స్పూన్ తేనెలో.. ఒక టీ స్పూన్ అల్లం జ్యూస్ కలిపి నెలసరి సమయంలో రోజుకి రెండుసార్లు తీసుకోవాలని సూచించారు.
అలా చేస్తే నొప్పులు నిమిషాల్లో తగ్గుతాయన్నారు. అయితే ఇది నెలసరి రోజుల్లోనే తీసుకోవాలని కోరారు.