చలికాలంలో ఎక్కువ శాతం మంది దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు గురవుతుంటారు.

ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా త్వరగా తగ్గదు. తగ్గినా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది.

అయితే కిచెన్ లో దొరికే కొన్ని ఆహార పదార్థాలతో దగ్గు, జలుబు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.  

అల్లంలో ఉండే థర్మోజెనిక్ గుణాలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి.

అల్లంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చలికాలంలో ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.

దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఇవి రక్షిస్తాయి.

అల్లం టీతో కూడా కఫం, జలుబు, దగ్గు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

వెల్లుల్లి దగ్గు, జలుబు వంటి సమస్యలతోపోరాడుతుంది. వెల్లుల్లిని డైరెక్ట్ గా లేదా చికెన్ సూప్ లో వేసుకుని తింటే మంచి ఫలితాలు ఉంటాయి.

వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డైట్ లో భాగం చేసుకోవచ్చు.

అడవి తేనె యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జలుబుని నియంత్రిస్తుంది.

పాలలో పసుపు కలుపుకుని తాగితే గొంతులో మంటతో పాటు దగ్గు తగ్గుతుంది.

నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. లెమన్ టీ లేదా వేడి లెమన్ వాటర్ తాగడం వల్ల గొంతు మంట, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

బాదంలో దగ్గు, జలుబుని నియంత్రించే లక్షణాలు ఉంటాయి. బాదం స్కిన్ పై ఉండే 

పాలీఫెనాల్స్, వ్యాధితో పోరాడే సమ్మేళనాలు తెల్ల రక్తకణాల సున్నితత్వం కోసం పని చేస్తాయి. ఇవి వైరస్ లతో వేగంగా, సమర్థవంతంగా పోరాడతాయి.

నోట్: పైన చెప్పిన చిట్కాలు పాటించేముందు ఓసారి డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.