సాధారణంగా ఇంటి యజమాని కష్టపడి పని చేసి.. కుటుంబాన్ని పోషిస్తాడు.
అయితే విధి వక్రించి పోషించే వాళ్లే దూరమైతే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది.
అందుకే నేటికాలంలో చాలా మంది బీమా పథకం తీసుకుంటూ ఉంటారు.
వాటిలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఉత్తమం అని ఆర్థిక నిపుణలు చెబుతుంటారు.
ఈ టర్మ్ పాలసీల్లో కేంద్రం తరఫున ఒక అద్భుతమైన టర్మ్ పాలసీ ఉంది.
ఆ పాలసీ పేరే.. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఏంజేజేవై).
2015లో ప్రారంభమైన ఈ బీమా పథకంలో 16.2 కోట్ల మంది చేరారు.
అలానే ఈ బీమా పథకంలో ఇప్పటి వరకు 6.64 లక్షల కుటుంబాలకు రూ.13.29 కోట్లు చెల్లించారు
18 నుంచి 50 ఏళ్లలోపు వాళ్లు మాత్రమే ఈ పథకంలో చేరేందుకు అర్హులు.
అలానే మీకు బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి.
మీ బ్యాంకు అకౌంట్ కు ఆధార్ తో లింక్ చేయాలి, అలానే కేవైసీ కూడా తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీకు ఉమ్మడి ఖాత ఉంటే ఇద్దరూ వేరు వేరుగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పథకానికి ఏటా రూ.436 చెల్లించాలి, అంటే కేవలం నెలకు రూ. 36 మాత్రమే కడతారు.
55 సంవత్సరాలలోపు బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.2 లక్షలు చెల్లిస్తారు.
మీరు ప్రీమియం చెల్లించిన తర్వాత ఏడాది మధ్యలో నిలిపివేయడం, వెనక్కి ఇచ్చేయడం సాధ్యం కాదు.
పాలసీ దారుడు 55 ఏళ్లకు చేరుకున్న తర్వాత బీమా పథకం రద్దవుతుంది.
ఈ బీమా పథకం తీసుకునేందుకు మీ దగ్గర్లోని బ్యాంకు/పోస్టాఫీసులో కనుక్కోవచ్చు.