మన నిత్య జీవితంలో ఆధార్ కార్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ క్రమంలో ఆధార్ కార్డ్ కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) సంచలన నిర్ణయం తీసుకుంది.
బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలకు భద్రత రక్షణలు లేకపోవడం వల్ల.. వీటిని ఉపయోగించడాన్ని నిషేధించింది.
అంతేకాక బహిరంగ మార్కెట్లో తయారు చేస్తోన్న నకిలీ పీవీసీ కార్డులను వాడటం మంచిది కాదని పేర్కొంది. అలాంటి పీవీసీ కార్డులు ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్ లను కలిగి ఉండవని యుఐడీఏఐ తెలిపింది.
కనుక వినియోగదారులు ప్రింటెడ్ పీవీసీ ఆధార్ కార్డును తీసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. అలానే పీవీసీ ఆధార్ కార్డు కావాలంటే.. రూ. 50 చెల్లించి.. ప్రభుత్వ ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది.
పీవీసీ ఆధారిత ఆధార్ కార్డు అనేక భద్రతలతో కూడిన ఫోటోగ్రాఫ్, డెమోగ్రాఫిక్ వివరాలతో డిజిటల్గా సంతకం చేసిన సురక్షిత క్యూఆర్ కోడ్ కలిగి ఉంటుంది.
ఈ కార్డు ఏటీఎం కార్డు పరిమాణంలో ఉంటుంది. దీన్ని నీటిలో వేసిన కూడా తడవదు. ఆధార్ పీవీసీ కార్డును మీరు పేర్కొన్న చిరునామాకు ఫాస్ట్ పోస్ట్ ద్వారా చేరవేస్తుంది.
1. యూఐడీఏఐ వెబ్ సైట్(https://myaadhaar.uidai.gov.in/) ఓపెన్ చేసి అందులో లాగిన్ అవ్వండి ‘ఆర్డర్ ది పీవీసీ కార్డ్’పై క్లిక్ చేయాలి.
2. అక్కడ మీకు మీ వివరాలు కనిపిస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి.