ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల వస్త్రాధరణపై తాజాగా చేసిన ఆయన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే మహిళలు నాలా దుస్తువులు లేకున్నా అందంగానే ఉంటారంటూ నీచంగా మాట్లాడారు. మహారాష్ట్రలో నిర్వహించిన యోగా సైన్స్ క్యాంప్ లో భాగంగా రామ్ దేవ్ బాబా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సమావేశంలో భాగంగా మహిళలు చేసిన యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, సీఎం ఏక్ నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే తదితరలు పాల్గొన్నారు.
కాగా ఈ సమావేశంలో మహిళలు వివిధ రకాల వస్త్రాధరణలో కనిపించారు. ఇక ఈ సందర్భంగా యోగా గురువు రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ.. మహిళలు చీరలు ధరిస్తే బాగుంటారు. సల్వార్ సూట్స్ లోనూ బాగుంటారని రామ్ దేవ్ బాబా అన్నారు. ఇక ఇంతటితో ఆగని బాబా.., మహిళలు నా లాగా బట్టులు లేకున్నా కూడా అందంగానే ఉంటారంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ దేవ్ బాబా ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అయితే రామ్ దేవ్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్త్రీల పట్ల ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా రామ్ దేవ్ బాబా అసలు క్యారెక్టర్ బయటపడిందని మండిపడ్డారు. తాజాగా చేసిన ఆయన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించి క్షమాపణ చేబుతారా లేదా అనేది వేచి చూడాలి.
“महिला साडीत छान दिसतात, सलवार-सूटमध्ये छान दिसतात, माझ्या नजरेने पाहिलं, तर काही नाही घातलं तरी छान दिसतात.”
-स्वामी रामदेव बाबा pic.twitter.com/FG6QheKeOm
— पवन/Pawan 🇮🇳 (@ThePawanUpdates) November 25, 2022