Viral Video: ప్రమాదాలకు గురైన వారిని క్షేమంగా ఆసుపత్రికి చేర్చడానికి లేదా ప్రథమ చికిత్స అందించటానికి ప్రభుత్వం 108 అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే, కొన్ని సందర్బాల్లో అంబులెన్స్ సమయానికి రాకపోవటం అన్నది జరుగుతూనే ఉంది. అంబులెన్స్ సమయానికి రాక ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. తాజాగా, ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రిలో చేర్చటానికి అంబులెన్స్కు ఫోన్ చేశారు. అయితే, అంబులెన్స్ అరగంట దాటినా సంఘటనా స్థలానికి రాలేదు. దీంతో బుల్డోజర్తో అతడ్ని ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటన మధ్య ప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్లోని గైరతాలయ్కి చెందిన మహేష్ భూషన్ బైకుపై వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి బైకు మరో బైక్ను ఢీకొట్టింది. దీంతో అతడి కాలుకు తీవ్రంగా గాయమైంది. రక్తం కారుతూ ఉంది. అక్కడి వారు అతడ్ని పక్కకు తీసుకువచ్చి, కాలుకు రక్తం కారకుండా గుడ్డ చుట్టారు. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. గాయంతో ఉన్న అతడు నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు. రక్తం కూడా పోతోంది. అరగంట గడిచినా అంబులెన్స్ మాత్రం రాలేదు. మహేష్ బాధ చూడలేక, ఓ బుల్డోజర్ డ్రైవర్ సహాయం చేయటానికి ముందుకు వచ్చాడు. బుల్డోజర్ ముందు భాగంలోని స్థలంలో అతడ్ని పడుకోబెడితే ఆసుపత్రికి చేరుస్తానన్నాడు.
ఇందుకు అక్కడివారు ఒప్పుకున్నారు. వెంటనే అతడ్ని బుల్డోజర్ ముందు భాగంలోకి చేర్చారు. డ్రైవర్ ఇక వేగంగా అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రికి చేరుకోగానే స్ట్రెచర్పై లోపలికి తీసుకెళ్లిపోయారు. వైద్యులు అతడి కాలుకు పరీక్ష చేశారు. బాగా విరిగినట్లు గుర్తించారు. ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు బుల్డోజర్ డ్రైవర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
साइकिल, ठेले, कंधे के बाद अब मरीज सीधे जेसीबी में! कटनी का मामला है लोगों का कहना है कि एंबुलेंस सेवा को कॉल किया था लेकिन मिली नहीं. @ndtv @ndtvindia pic.twitter.com/CfxRlNfXEM
— Anurag Dwary (@Anurag_Dwary) September 13, 2022
ఇవి కూడా చదవండి : వీడియో: బుడ్డోడి అల్లరికి అలిగిన టీచర్! ముద్దులు పెట్టి క్యూట్గా బతిమిలాడాడు!