పెళ్లంటే నూరేళ్ల పంట అని కొందరు అంటుంటే.. దానిని మించిన నరకం మరొకటి లేదని మరికొందరు అంటున్నారు. ఇలా ఎవరికి వారు తోచినట్లుగా చెబుతున్నా.. పెళ్లిళ్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి, కాపురాలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంచితే.. జీవితంలో ఒక పెళ్లి చేసుకుని సంసారాన్ని ఈడ్చలేక సతమతమవుతుంటే.. కొంతమంది మాత్రం ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లిళ్లు చేసుకుని మెయింటెన్స్ చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి మొదటి భార్యకు తెలియకుండా మరో భార్యను పెళ్లి చేసుకుని చివరికి పోలీసుల స్టేషన్ కు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక పోలీసులు ఎలాంటి కౌన్స్ లింగ్ ఇచ్చారు? ఆ తర్వాత భర్త తీసుకున్న నిర్ణయం ఏంటనేది తెలుసుకోవాలనుందా? అయితే మీరు తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే.
అది ఉత్తర్ ప్రదేశ్ మొరదాబాద్ లోని గౌతమ్ బుద్ద నగర్. ఇదే ప్రాంతానికి చెందిన సలీమ్ అనే వ్యక్తి 2017లో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్లైన తర్వాత అతను తన ఇంటికి వెళ్లకుండా ఓ చోట అద్దెకు దిగి తన భార్యతో ఉండేవాడు. అలా చాలా ఏళ్లు గడిచింది. ఇన్నేళ్లలో భార్య అనేక సార్లు అత్తింటికి నన్ను తీసుకెళ్లాలని భర్తను కోరింది. భార్య అడిగిన ప్రతీ సారి ఏదో ఒకటి చెబుతూ… భర్త సలీమ్ ఆ ప్రశ్నకు సమాధానం దాట వేస్తూ వచ్చాడు. అయితే ఇటీవల సలీమ్ ఉన్నట్టుండి కనిపించకుండపోయాడు. దీంతో అతని భార్య భర్త ఆచూకి కోసం అంతటా వెతికింది.
ఎంత వెతికినా భర్త జాడ మాత్రం దొరకలేదు. ఇక ఎలాగో భార్య భర్త జాడ కనుక్కుని ఏకంగా అతని ఇంటికే వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లాక ఆ మహిళకు ఓ నమ్మలేని నిజం తెలిసిపోయింది. అది ఏంటంటే? అతనికి అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారని. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ ఒక్కసారిగా షాక్ కు గురై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు భర్తను స్టేషన్ కు పలిపించి అతనితో పాటు ఇద్దరి భార్యలకు కౌన్స్ లింగ్ ఇప్పించారు. ఇక కౌన్స్ లింగ్ అనంతరం.. ముగ్గురు ఓ ఒప్పందానికి వచ్చారు. భర్త 3 రోజులు ఒక భార్యతో, మరో 3 మూడు రోజులు మరొక భార్యతో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలిన చివరి రోజు మాత్రం అతని ఇష్టానికే వదిలేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.