దొంగలు.. రాను రాను వీళ్లు చాలా తెలివిమీరిపోతున్నారు. సినిమాల్లో చూసి నేర్చుకుంటున్నారో? లేక స్వతహాగానే ఈ ఐడియాస్ వస్తునాయో తెలియదు. కానీ, వెలుగు చూస్తున్న దొంగతనం కేసులు చూస్తుంటే నోరెళ్లబెట్టాల్సిందే. గతంలో అంటే బంగారం, నగలు, డబ్బు, వస్తువులు వంటివి దోచేసేవారు. తర్వాత తర్వాత సెల్ఫోన్లు, గాడ్జెట్స్ కూడా దోచేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు చెప్పుకోబోయే దొంగతనం గురించి చెబితే ఆశ్చర్యపోవాల్సిందే. గూడ్స్ ట్రైన్లో ఆయిల్ కొట్టేశారు. అది కూడా ట్రైన్ రన్నింగ్లో ఉండగా ఆ దొంగలు చాకచక్యంగా ఆయిల్ని దొంగతనం చేశారు. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘరానా దొంగతనం చేసింది బిహార్ దొంగలు. సాధారణంగా వీళ్లకి దొంగతనంలో చాలా మంచి పేరే ఉంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుండగా మరింతగా వీళ్ల గురించి మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే.. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆయిల్ డిపోకి గూడ్స్ రైలులో ఆయిల్ తరలిస్తున్నారు. ఆ సమాచారం అందుకున్న దొంగలు ఆయిల్ కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. మార్గం మధ్యలో ఓ వంతెన ఉంటుంది. రైలు కచ్చితంగా అక్కడ నెమ్మదిగా వెళ్లక తప్పదు. ఆ ప్రాంతాన్నే వాళ్ల చోరీకి స్పాట్గా చేసుకున్నారు. రైలు వంతెనపైకి రాగానే బకెట్లు తీసుకుని రన్నింగ్ బోగీల వెనకాల పరిగెడుతూ ఆయిల్ చోరీ చేయడం ప్రారంభించారు.
వాళ్లు అలా బోగీల వెనకాల పడుతూ ఆయిల్ దొంగతనం చేయడాన్ని అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఫోన్లో వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. బిహార్ దొంగల బండారం బయటపడింది. ఈ దృశ్యాలు చూస్తున్న నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మీరేం దొంగలు రా నాయనా.. గూడ్స్ ట్రైన్ వెనకాల పరిగెడుతూ దొంగతనం చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే బిహార్ దొంగల పనితనం తెలిసిన వాళ్లు ఇలాంటివి సర్వ సాధారణం అంటూ చెబుతున్నారు. అయితే బిహార్లో ఇలాంటివి కొత్తేం కాదు. సెల్ టవర్లు, వంతెనలు కూడా మాయం చేశారు. ఇటీవలే అయితే రైల్ ఇంజిన్ని కూడా చోరీ చేశారు.
Bihar: Thieves steal oil from moving train in Bihta to close out 2022 on a high. pic.twitter.com/eKBPSp5HPR
— KK (@krishnakakani08) December 4, 2022