ప్రాణాపాయంలో ఉన్న మనుషుల్ని, జంతువుల్ని కాపాడటం అందరి వల్ల కాదు. తమ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినపుడు మనుషులు సహాయం చేయటానికి అస్సలు పూనుకోరు. మాకెందుకులే అనుకుంటారు. కానీ, తమ ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలు కాపాడే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో బెంగళూరుకు చెందిన సురేష్ అనే పోలీస్ కూడా ఒకరు. ఆయన ఓ పక్షి ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఎంతో రిస్క్ చేసి దాన్ని కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సురేష్ ట్రాఫిక్ విభాగంలో పోలీస్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం టవర్పై తాడుకు వేలాడుతున్న ఓ పక్షి ఆయనకు కనిపించింది. దీంతో ఆయన ఏమాత్రం ఆలోచించకుండా టవర్ దగ్గరకు వెళ్లారు. ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా టవర్ మీదకు ఎక్కారు. పైకి ఎక్కిన తర్వాత తాడుకు వేలాడుతున్న పక్షిని విడిపించారు. తర్వాత దాన్ని స్వేచ్ఛగా గాలిలోకి వదిలేశారు. ఇదంతా చేస్తున్నపుడు ఆయన బ్యాలెన్స్గా రాడ్డు మీద నిలబడ్డారు. కొంచెం అటు, ఇటు అయినా పెద్ద ప్రమాదం జరిగేది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ వీడియోను ఓ ఐపీఎస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘పోలీసుల్లో దాగి ఉన్న, బయటకు రాని కోణం.. శభాష్ సురేష్’’ అని పేర్కొన్నారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు సురేష్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి మంచి పనులు చేసే ముందు వెనకా ముందు ఆలోచించాలని, రక్షణ ఏర్పాట్లు ఉన్న తర్వాతే ముందడుగు వేయాలని అంటున్నారు. లేకపోతే ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
The hidden and unexplored side of a policemen. Well done Mr Suresh from @rajajinagartrps pic.twitter.com/D9XwJ60Npz
— Kuldeep Kumar R. Jain, IPS (@DCPTrWestBCP) December 30, 2022