Pitbull Dog: ప్రపంచంలోని అతి ప్రమాదకరమైన కుక్క జాతుల్లో పిట్ బుల్ ఒకటి. ఈ జాతి కుక్కలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. మనుషులతో ఎప్పుడెలా ప్రవర్తిస్తాయో కూడా తెలీదు. వాటి ధ్రుడమైన శరీరం కారణంగా వాటి దాడినుంచి తప్పించుకోవటం చాలా కష్టం. అవి దాడి చేస్తే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. చాలా మంది అలా ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. సొంత యజమానుల్ని సైతం పిట్బుల్లు చంపిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా, ఓ పిట్ బుల్ డాగ్ ఆవుపై దాడి చేసింది. ఆవు మూతిని కరిచి పట్టుకుంది. ముగ్గురు వచ్చి దాన్ని కొడితే కానీ, విడిచి పెట్టలేదు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తి పిట్బుల్ డాగ్ను పెంచుకుంటున్నాడు. తాజాగా, అది ఓ ఆవుపై దాడి చేసింది. ఆవు మూతిని కరిచి పట్టుకుంది. అది గమనించిన పిట్ బుల్ డాగ్ యజమాని, మరికొంత మంది కుక్కను విడిపించే ప్రయత్నం చేశారు. అయితే, ఆ కుక్క ఆవు మూతిని గట్టిగా పట్టుకుని వదల్లేదు. దీంతో వారు కర్రలతో దాడి చేయటం మొదలు పెట్టారు. అయినా కూడా ఆ కుక్క వదల్లేదు. ఈ నేపథ్యంలోనే అందరూ నీళ్లలోకి వెళ్లిపోయారు. తర్వాత బలంగా కొట్టడంతో కుక్క.. ఆవు మూతిని వదిలిపెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా, జులై నెలలో లక్నోకు చెందిన ఓ 82 ఏళ్ల వృద్ధురాలిని పెంపుడు పిట్బుల్ డాగ్ చంపేసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు దాడి చేసి పొట్టన పెట్టుకుంది. ఆ తర్వాత సరిగ్గా నెలకు మరో ఘటన చోటుచేసుకుంది. ఓ పిట్ బుల్ డాగ్ 30 ఏళ్ల యువతిపై దాడి చేసింది. అయితే, ఈ ఘటనలో సదరు యువతి ప్రాణాలతో బయటపడింది. ఈ నెలలో కూడా ఓ 11 ఏళ్ల కుర్రాడిపై పిట్ బుల్ దాడి చేసింది. ఆ పిల్లాడి ముఖంపై 200 కుట్లు పడ్డాయి. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Now a Pitbull (dog) attacks a Cow in Sarsaiya ghat, #Kanpur #PitBullDog pic.twitter.com/l9hvUlc8fp
— Aak thuu (@dhakad_reporter) September 22, 2022