ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిబ్రవరి 14కు ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇక, ఫిబ్రవరి 14కు వారం ముందు నుంచే సంబరాలు మొదలవుతాయి. రోస్డే, చాక్లెట్ డే, కిస్సింగ్, హగ్గింగ్ డే..ఇలా ఏడు రోజుల్ని ప్రేమికులు అద్భుతంగా జరుపుకుంటూ ఉంటారు. ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ, పుచ్చుకుంటూ సంతోష పడిపోతుంటారు. అయితే, లవర్స్ డే జరుపుకోవటం లాంటివి కొన్ని కాలేజీల్లో నిషిద్ధం. ఆ రోజు ఎలాంటి సెలెబ్రేషన్స్ జరిపినా చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అమ్మాయిలు, అబ్బాయిలు క్లోజ్గా కనిపించినా శిక్షలు వేస్తుంటాయి. అయితే, ఓ కాలేజీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది.
ప్రేమికుల రోజు కోసం ఓ కొత్త రూల్ను తీసుకువచ్చింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఇంతకీ ఏంటా సర్క్యులర్? అందులో ఏముందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ మొత్తం చదివేసేయండి. ఇంతకీ సంగతేంటంటే.. ఒరిస్సాలోని జగత్సింగ్పూర్లో ఎస్వీఎమ్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్లో వందల సంఖ్యలో యువతీ,యువకులు చదువుతున్నారు. ఫిబ్రవరి 14 దగ్గరపడటంతో కాలేజ్ ప్రిన్సిపల్ ఓ సర్క్యులర్ జారీ చేశాడు. అందులో ‘‘ కాలేజ్లోని ప్రతీ అమ్మాయికి కనీసం ఒక బాయ్ఫ్రెండ్ అయినా ఉండాలి. ఇది కేవలం సెక్యూరిటీ పర్పస్ కోసం మాత్రమే. సింగిల్గా ఉండే అమ్మాయిలకు కాలేజ్లోకి ఎంట్రీ లేదు.
వారు ఈ మధ్య కాలంలో బాయ్ఫ్రెండ్తో దిగిన ఫొటో చూపిస్తే మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. ప్రేమను పంచండి’’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ సర్క్యులర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై కామెంట్లు చేస్తున్న నెటిజన్లు.. ‘‘ ఇలాంటి రూల్ మా కాలేజ్లో పెడితే బాగుండు’’.. ‘‘ కాలం మారింది.. కాలంతో పాటు కాలేజ్లు కూడా మారాయి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ సర్క్యులర్పై కాలేజ్ యజమాన్యం స్పందించింది. ఆ సర్క్యులర్ నిజమైనది కాదని స్పష్టం చేసింది. ఎవరో తమ కాలేజ్ పేరును దెబ్బ తీయటానికి ఇలా చేస్తున్నారని తెలిపింది. మరి, ఈ సర్క్యులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.