మాములుగా మన ఇంటికి ఎవరైన కొత్త వ్యక్తులు కానీ లేక అతిధులు వచ్చినప్పుడు వారితో మర్యాదగా మాట్లాడి రాగానే మంచి నీళ్లు ఇవ్వడం అలవాటు. ఇలా చేయడం మంచి మనుషుల సంస్కారం కింద కొలుస్తారు. ఇలా మంచి నీళ్లు ఇవ్వడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే బస్సులో కండక్టర్ ఎక్కిన ప్రయాణికులకు టికెట్ ఇవ్వడం చూస్తుంటాం కానీ మంచి నీళ్లు ఇవ్వడం ఎక్కడైన చూశారా? బస్సులో ప్రయాణికులకు కండక్టర్ మంచి నీళ్లు ఇవ్వడం ఏంటని తెగ ఆలోచిస్తున్నారా?
అవును మీరు విన్నది నిజమే. హర్యానాకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సెక్కిన ప్రయాణికులకు ముందుగా మంచి నీళ్లు ఇచ్చి ఈ తర్వాత టికెట్ ఇస్తున్నాడు. అసలు ఈ వ్యక్తి ఎందుకు అలా చేస్తున్నాడనేదే కదా మీ ప్రశ్న. అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది హర్యానా రాష్ట్రం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బస్ కండక్టర్ పని చేస్తున్నాడు సురేందర్ శర్మ అనే వ్యక్తి.
ఇది కూడా చదవండి: Video: పాపం ఎంగేజ్ మెంట్ రోజే అల్లరిపాలయ్యాడు..!
ఎండలో వచ్చిన ప్రయాణికులకు దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతోనే నేను ఇలా చేస్తున్నానని సురేందర్ శర్మ చెబుతున్నాడట. ఏకంగా బస్సులో వాటర్ క్యాన్ ను మెయింటెన్ చేస్తున్న ఈ కండక్టర్ బస్సెక్కిన ప్రయాణికులకు ముందుగా మంచి నీళ్లు ఆ తర్వాత మర్యాదగా ఎక్కడికి వెళ్లాలని టికెట్ ఇస్తున్నాడు. సురేందర్ ఆలోచన తీరుపై ప్రయాణికులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
దీనికి సంబంధించి కొందరు ప్రయాణికులు బస్సులో కండక్టర్ నీళ్లు ఇస్తున్న ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇదే విషయాన్ని హర్యానా రాజ్యసభ సభ్యుడు దీపేందర్ సింగ్ హుడా తన ట్విట్టర్ ఖాతో పోస్ట్ చేయడంతో అది ఇంకాస్త వైరల్ గా మారింది. ఇలా ప్రయాణికులకు టికెట్ కంటే ముందుగా నీళ్లు ఇస్తున్న కండక్టర్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
हरियाणा रोडवेज में कंडक्टर पद पर सेवारत सुरेंद्र जी की खासियत यह है कि जिस बस में ड्यूटी होती है उसमें पानी के कई कैन रखते हैं।यात्रियों को बस में चढ़ते ही पीने को पानी देकर लोगों के मन में अमिट छाप छोड़ देते हैं।
भाली आनंदपुर, रोहतक के भाई सुरेंद्र शर्मा सब के लिए प्रेरणा हैं। pic.twitter.com/WQzMUh5Fnu
— Deepender S Hooda (@DeependerSHooda) June 5, 2022