సాధారణంగా బిడ్డలపై తల్లికి ఉన్న ప్రేమ భూమి పై మరేవరికీ ఉండదు. బిడ్డకు ఎలాంటి కష్టం వచ్చిన తల్లి అల్లాడిపోతుంది. ఇంటి పని ఏదైనా ఉంటే వీలైనంత వరకు తానే చేసుకుంటుంది. తల్లి పోరపాటున కూడా బిడ్డలను వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పనుల జోలికి అసలు పోనివ్వదు. కానీ ఓ తల్లి మాత్రం చీర కోసం కొడుకు ప్రాణాలను పణాంగా పెట్టి ఓ ఘనకార్యం చేసింది. ఆమె చేసిన పని తెలిసిన స్థానికులు పిచ్చ తిట్లు తిడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. ఇంతకి ఆ తల్లి చేసిన పని ఏంటి? ఎందుకు జనాలు ఆమెను తిడుతున్నారు? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్ లోని ఫరిదాబాద్ లోని సెక్టార్-82 లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉండే ఓ మహిళ.. బాల్కనీలో చీరను ఆరేసింది. అది కాస్త కింద ఫోర్ల్ లో పడిపోయింది. దీంతో తీసుకోవడానికి కింద ఫోర్ల్ లోకి వెళ్లగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. తరువాత తీసుకోవచ్చు అనే ఆలోచన లేకుండా.. వెంటనే తీసుకోవడం కోసం ఆమె ఓ పనికి పూనుకుంది. వేరేవాళ్ల సాయం కోరకుండా చీరతో కొడుకును కట్టి కిందకు వేలాడదీసి పంపింది. అదే సమయంలో వీరికి ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ లో ఉండే ఓ వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.
దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. ఏ మాత్రం భయపడకుండా ఆ పిల్లవాడు పైకి వెళ్తుండగా.. ఆ తల్లి నిమ్మలంగా పైకి లాగుతూ కనిపించింది. ఆ పక్కనే మరికొందరు ఉన్నారు. ఈ చీర తీసుకొచ్చే క్రమంలో పట్టుతప్పి ఆ పిల్ల వాడు పడితే ఏంటి? అని స్థానికులు ఆ తల్లిని తిడుతున్నారు. ఈ ఘటన పోలీసుల దృష్టికి సైతం వెళ్లింది. వాళ్లు ఏం చేస్తారో చూడాలి మరి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.